210 మంది కౌలు రైతులకు లక్ష చొప్పున ఆర్ధిక సాయం అందచేసిన జనసేన అదినేత పవన్ కళ్యాణ్

Andhra Pradesh : ఈరోజు ఉమ్మడి గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం, ధూళిపాల గ్రామంలో కౌలు రైతు భరోసా యాత్ర నిర్వహించారు జనసేన అదినేత పవన్ కళ్యాణ్.
కౌలు రైతుల కన్నీటి వెతలు ఆలకిస్తూ వారి కుటుంబాల్లో భరోసా నింపారు.
210 మంది కౌలు రైతులకు లక్ష చొప్పున ఆర్ధిక సాయం అందచేసారు జనసేన అధినేత.

ఈ యాత్రలో భాగంగా ప్రజలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. 
"నా సొంత సంపాదనను నిస్వార్థంగా రైతుల కోసం ఇస్తున్నాను, అలాంటిది రాష్ట్ర ఖజానా ను జనసేన ప్రభుత్వం చేతిలో పెడితే ఎంతో భాద్యతగా రాష్ట్ర అభివృద్ధి, రైతుల సంక్షేమం కోసం ఖర్చుపెడతాంఖర్చుపెడతాం." అని అన్నారు.
ప్రజలకి కష్టాలు వస్తే కన్నీళ్లు తుడిచే యంత్రాంగం లేదని ఆరోపించారు.
జనసేన ప్రభుత్యంలో ప్రతి పైసాకు లెక్క ఉంటుందని ప్రజలకు భరోసానిచ్చారు పవన్.

0/Post a Comment/Comments