వీర్ సావర్కర్‌పై మాట్లాడే స్థాయి రాహుల్ గాంధీకి ఉందా?: రాజ్ థాకరే


Maharashtra : ఆదివారం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సమరయోధుడు వీర్ సావర్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై మండిపడ్డారు. 
50 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడిన సావర్కర్‌ గురించి చెడుగా మాట్లాడేంత స్థాయి రాహుల్‌గాంధీకి ఉందా?.. జైలు నుంచి బయటకు రావడానికి వ్యూహంలో భాగంగా బ్రిటిష్ వారికి నకిలీ క్షమాపణ లేఖ రాసారని, దాన్ని లొంగిపోవడం లేదా దేశద్రోహం అని ఎలా అంటారని ఆయన ప్రశ్నించారు.
వీర సావర్కర్, జవహర్‌లాల్ నెహ్రూ వంటి జాతీయ దిగ్గజాలపై దుష్ప్రచారం చేయడం మానేసి, దేశం ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యలపై దృష్టి సారించాలని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్) అధ్యక్షుడు రాజ్ థాకరే కాంగ్రెస్, బిజెపిలను కోరారు.

0/Post a Comment/Comments