రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్,సచిన్ పైలట్ ఆధిపత్య పోరుపై స్పందించిన రాహుల్ గాంధీ

Rahul gandhi sachin pilot ashok gehlot politics meter

Rajasthan :
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సచిన్ పైలట్ కాంగ్రెస్ పార్టీకి ఆస్తులని , రాజస్థాన్ కాంగ్రెస్ లో  కొనసాగుతున్న అధికార పోరు భారత్ జోడో యాత్రపై ప్రభావం చూపదని కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత రాహుల్ గాంధీ సోమవారం అన్నారు.

సీఎం అశోక్ గెహ్లాట్, రాజస్థాన్ మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ మధ్య జరిగిన తాజా మాటల యుద్ధం గురించి రాహుల్ గాంధీ ఇండోర్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

“(వారి) వ్యాఖ్యలపై నేను ఏమీ చెప్పదలచుకోలేదు. ఇద్దరు నేతలూ మాకు ఆస్తులు, ఈ వివాదం భారత్ జోడో యాత్రపై ప్రభావం చూపదని నేను చెప్పగలను’ అని గాంధీ విలేకరులతో అన్నారు..

0/Post a Comment/Comments