బెంగాల్ ఎన్నికల తర్వాత తొలిసారి సువెందు అధికారిని కలిసిన మమతా బెనర్జీ...

Mamata banerjee Suvendu Adhikari meeting assembly politics meter

West Bengal : గతేడాది జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నియోజకవర్గం నుండి ఓటమిపాలైన తర్వాత తొలిసారిగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుక్రవారం ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారిని కలిశారు.

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు అగ్నిమిత్ర పాల్, మనోజ్ తిగ్గా కూడా సువేందు అధికారితో కనిపించారు.. 

సమావేశం అనంతరం సువేందు అధికారి మీడియాతో మాట్లాడుతూ "నేను ఈరోజు సీఎం మమతా బెనర్జీతో 3-4 నిమిషాల పాటు మర్యాదపూర్వకంగా సమావేశమయ్యాను. నందిగ్రామ్ నుండి పోటీ చేయడం మమత జీపై వ్యక్తిగత పోరాటం కాదు, రాజకీయ & సైద్ధాంతిక పోరాటం" అని అన్నారు. 

సువేందుతో సమావేశం అనంతరం బెంగాల్ సీఎం మమత అసెంబ్లీ సమావేశంలో సువెందును తన సోదరుడిగా సంబోధించారు. "నేను అతనిని సోదరుడిలా ప్రేమించాను, అతను ప్రజాస్వామ్యం గురించి మాట్లాడాడు" అని మమత అన్నారు.

0/Post a Comment/Comments