తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్రలకు సీబీఐ నోటీసులు..

CBI Gangula Kamalakar Delhi Politics meter
Vaddiraju Ravichandra,Gangula Kamalakar

తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్, టీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్రలకు సీబీఐ నోటీసులు జారీచేసింది. 

డిసెంబరు 1, గురువారం నాడు ఢిల్లీలోని సిబిఐ ప్రధాన కార్యాలయంలో విచారణలో పాల్గొనవలసిందిగా కోరుతూ సిబిఐ తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్, టిఆర్ఎస్ ఎంపి వద్దిరాజు రవిచంద్రలకు నోటీసులు జారీచేసింది.

కొద్ది రోజుల క్రితం ఢిల్లీలోని టీఎన్ భవన్‌లో అరెస్టయిన నకిలీ సీబీఐ అధికారి కొవ్విరెడ్డి శ్రీనివాసరావు కేసులో తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్, టీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు లకు ప్రమేయం ఉందంటూ సీబీఐ నోటీసులు జారీ చేసింది.

ఇటీవలే గ్రానైట్ కేసులో మనీలాండరింగ్‌కు సంబంధించి టీఆర్‌ఎస్ ఎంపీ వద్దిరాజు రవీంద్ర ,టీఆర్ఎస్ మంత్రి గంగుల కమల్కర్‌ నివాసాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు జరిపిన విషయం తెలిసిందే.

0/Post a Comment/Comments