టీఆర్ఎస్ మంత్రి మల్లా రెడ్డి, ఐటీ అధికారిపై కేసులు నమోదు

తెలంగాణ మంత్రి మల్లారెడ్డి, ఆయనపై సోదాలు నిర్వహించిన ఆదాయపన్ను శాఖ అధికారిపై హైదరాబాద్‌లోని బోవెన్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో రెండు ఫిర్యాదులు నమోదయ్యాయి.  
మంత్రి మల్లారెడ్డి తనయుడు భద్రారెడ్డి ఐటి అధికారి తనతో బలవంతంగా కొన్ని పేపర్లపై సంతకాలు చేయించుకున్నారని ఫిర్యాదు చేయగా, మంత్రి మల్లారెడ్డి తన ఫోన్, డాక్యుమెంట్లు, ఇతర వస్తువులు లాక్కున్నారని ఐటీ అధికారి మరో ఫిర్యాదు చేశారు.

బుధవారం మీడియాతో మాట్లాడిన మల్లారెడ్డి.. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం 50 ఐటీ బృందాలతో తనను వేధిస్తున్నదని,  ఈ దౌర్జన్యం అంతం కావాలని ఆయన అన్నారు.  గత 20 ఏళ్లుగా కాలేజీలు నడుపుతూ డబ్బు సంపాదిస్తున్నానని, అయినా బీజేపీ ప్రభుత్వం మమ్మల్ని వేధిస్తున్నదని మంత్రి అన్నారు.

0/Post a Comment/Comments