'గద్దార్’ సచిన్ పైలట్ ఎప్పటికి రాజస్థాన్ సీఎం కాలేడు: అశోక్ గెహ్లాట్

Ashok Gehlot sachin pilot traitor rajasthan congress politics meter

Rajasthan : భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలట్ కనిపించిన సమయంలో, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అతన్ని ‘గద్దార్’ (ద్రోహి) అని అన్నారు, సచిన్ పైలట్ ముఖ్యమంత్రి పదవి కోసం తిరుగుబాటుకు పాల్పడిన ‘గద్దార్’ అని అన్నారు. పైలట్‌ను రాజస్థాన్‌కు సీఎం కావడానికి అనుమతించనని అన్నారు. ఎన్‌డిటివికి చెందిన శ్రీనివాసన్ జైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో గెహ్లాట్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.

సచిన్ పైలట్‌ను ముఖ్యమంత్రిని చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నారా అని అడిగినప్పుడు, గెహ్లాట్ స్పందిస్తూ, “వారు అతనిని ఎలా సీఎం చేస్తారు ? పది మంది కంటే తక్కువ ఎమ్మెల్యేల మద్దతున్న వ్యక్తి. ముఖ్యమంత్రి పదవి కోసం తిరుగుబాటు చేశాడు. పార్టీకి ద్రోహం చేసిన అతనిని ప్రజలు ఎలా అంగీకరిస్తారు?" అని అన్నారు. 

0/Post a Comment/Comments