ఇరుపక్షాల వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు సస్పెన్షన్లో ఉన్న బిజెపి ఎమ్మెల్యే రాజా సింగ్ను విడుదల చేయాలని ఆదేశించింది.
ఎమ్మెల్యే రాజా సింగ్ ర్యాలీలు, ప్రెస్మీట్లు నిర్వహించకూడదని షరతులు విధించింది హైకోర్టు..
రాజా సింగ్ తరపు న్యాయవాది కరుణ సాగర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘పీడీ యాక్ట్ను హైకోర్టు పక్కన పెట్టింది. ఎలాంటి ర్యాలీలు నిర్వహించకూడదని, ప్రెస్ మీట్లలో మాట్లాడకూడదని, భవిష్యత్తులో సోషల్ మీడియాలో ఎలాంటి కించపరిచే వ్యాఖ్యలు చేయకూడదని రాజా సింగ్కు కొన్ని షరతులు విధించారు’’ అని తెలిపారు.
మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై ఆగస్ట్ 25న రాజా సింగ్పై పోలీసులు పీడీ యాక్టు నమోదు చేశారు.
కామెంట్ను పోస్ట్ చేయండి