తొలిసారి భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన రిషి సునక్..

Narendra Modi Rishi Sunak G20 Summit Indonesia Politics Meter

రిషి సునక్ తొలిసారి భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ప్రధాని మోదీ, బ్రిటన్ ప్రధాని రిషి సునక్ G-20 సమ్మిట్ సమావేశం లో కలుసుకోవడం జరిగింది. వీరిద్దరూ మాట్లాడుకుంటున్న సమయంలో తీసిన ఫొటోను పీఎంవో(PMO) కార్యాలయం ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.
ఇటీవలే రిషి సునక్ బ్రిటన్ ప్రధాన మంత్రిగా ఎన్నికయ్యారు, రిషి భారతీయ సంతతికి చెందిన వ్యక్తి, ఒక హిందువు బ్రిటన్ కు ప్రధాన మంత్రిగా ఎన్నికవ్వడం ఇదే మొదటి సారి. 

జి-20 సదస్సు(G20 Summit) కోసం 20 దేశాల నేతలు ఇండోనేషియాలోని బాలి చేరుకున్నారు. ఈ నేతలు బహుపాక్షిక, ద్వైపాక్షిక సమావేశాల శ్రేణిని నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ తదితరులు హాజరవుతున్నారు. తదుపరి జి-20 సదస్సు భారత్‌లో జరగనుంది.

0/Post a Comment/Comments